బీజేపీ 8 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను తొలగించింది.. కేటీఆర్ ట్వీట్

by Bhoopathi Nagaiah |   (  Updated:2022-08-26 13:16:12  IST  )

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ రమేష్ బయాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

బీజేపీ 8 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను తొలగించింది.. కేటీఆర్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ రమేష్ బయాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'బీజేపీ తన వద్ద ఉన్న అన్ని సంస్థాగత సాధనాలను దుర్వినియోగం చేయడం మరియు 8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను తొలగించడం సరిపోదన్నట్లుగా... జార్ఖండ్, ఢిల్లీలో బీజేపీ అదే తప్పును పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తోంది. మేడమ్ నిర్మలాజీ హార్స్-ట్రేడింగ్‌పై జీఎస్టీ విధించడానికి ఇదే సరైన సమయం' అంటూ సెటైర్లు వేశారు.

ఇవి కూడా చదవండి : ప్రభుత్వాలను కూల్చే సీరియల్ కిల్లర్ బీజేపీ : Arvind Kejriwal



Next Story